చిరంజీవికి 'పద్మ విభూషణ్'... అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే

Update: 2024-01-26 12:14 GMT

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇక ఆయనతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా పద్మ విభూషణ్ వరించింది. కాగా చిరంజీవికి అవార్డు రావడం పట్ల పాన్ ఇండియా స్టార్, ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైనందుకు ధన్యవాదాలు అని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి తాను అందించిన సేవలు తనతో పాటు ఎందరో అభిమానులకు ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సేవలను గుర్తించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

"155 సినిమాలు, 10 లక్షల మందికి ఉచితంగా రక్తదానం, 9 ఫిలింఫేర్ అవార్డులు, కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 32 ఆక్సిజన్ బ్యాంకులు, పద్మ భూషణ్, 3 నంది అవార్డులు, కేంద్ర టూరిజం మినిస్టర్, తాజాగా పద్మ విభూషణ్.. దట్ ఈజ్ చిరంజీవి కొణిదెల" అంటూ బన్ని ఓ పోస్టర్ ను షేర్ చేశారు.





Tags:    

Similar News