శామ్ సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ఫోన్లు

Byline :  Vamshi
Update: 2024-03-14 10:47 GMT

భారత్‌లో శామ్‌సంగ్ ఇటీవల గెలాక్సీ ఏ55, ఏ35 స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరించింది. తాజాగా వాటి ధరలతో పాటు పూర్తి ఫీచర్లను వెల్లడించింది.రెండింటిలోనూ 50 ఎంపీ ఓఐఎస్ మెయిన్, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. ఏ55లోసెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తుండటం విశేషం. ఇందులో.. లో- లైట్​ ఫొటోగ్రఫీ కోసం ఏఐ ఇమేజ్​ సిగ్నల్​ ప్రాసెసింగ్​ ఉంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది.సామ్​సంగ్​ గెలాక్సీ ఏ35లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. ఎక్సినోస్​ 1380 ప్రాసెసర్​ దీని సొంతం.

మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులోకి వచ్చింది. వి.. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత వన్​ యూఐ 6.1 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. దీనికి.. నాక్స్​ 3.1 ప్రొటెక్షన్​ లభిస్తోంది. సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 12,999, 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 14,499గా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ మొబైల్​పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్​ని సంస్థ ఇస్తుంది.

Tags:    

Similar News