భారత క్రికెట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ మరణించారు. 95 ఏళ్ల వయసుగల ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. బరోడాలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబీకులు తెలిపారు. గత 12 రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణం పట్ల పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు.
భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ అయిన ఔన్షుమాన్ గైక్వాడ్ తండ్రే దత్తాజీరావు గైక్వాడ్. అందరూ ఆయన్ని దత్తా గైక్వాడ్ అని పిలుస్తారు. 1952 -61 మధ్యకాలంలో భారత్ తరపున ఆయన 11 టెస్టులు ఆడారు. అందులో 350 పరుగులు చేశారు. 1959లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియాకు కెప్టెన్గా ఉన్నారు. 1961లో చెన్నైలో పాకిస్తాన్ జట్టుపై ఆయన ఆఖరి మ్యాచ్ ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆయన 3139 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉన్నాయి. దత్తాజీరావు మృతిపై బీసీసీఐ సంతాపం తెలిపింది.
The BCCI expresses its profound grief at the passing away of Dattajirao Gaekwad, former India captain and India’s oldest Test cricketer. He played in 11 Tests and led the team during India’s Tour of England in 1959. Under his captaincy, Baroda also won the Ranji Trophy in the… pic.twitter.com/HSUArGrjDF
— BCCI (@BCCI) February 13, 2024