బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ శుభారంభం

Update: 2023-07-09 12:35 GMT

బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మిర్పూర్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 16.2 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 54) అర్థసెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన (34 బంతుల్లో 38) రాణించింది. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును హర్మన్ ప్రీత్, మంధాన ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి భారత్‌ను విజయంవైపు నడిపించారు.

అంతకుముందు భారత్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 114/5 స్కోర్ మాత్రమే చేసింది. షోర్నా అక్తర్‌ (28) టాప్‌ స్కోరర్‌. శోభన మోస్తరీ (23), శతీ రాణి (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌, మిన్ను మణి, షెఫాలీ వర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్‌ జులై 11న జరగనుంది

Tags:    

Similar News