బీసీసీఐ ప్లాన్ అదిరింది.. వరల్డ్కప్కు ముందు.. ఆసీస్తో వన్డే సిరీస్

Update: 2023-07-25 17:02 GMT

వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ప్రణాలిక మొదలుపెట్టింది. సొంత గడ్డపై జరిగే ఈ టోర్నీలో ఎలాగైనా గెలిచి 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తున్నారు. వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఆసియా కప్ కాకుండా.. పలు దేశాలతో వన్డే సిరీస్ లు ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను ప్లాన్ చేసింది బీసీసీఐ.

మొహాలీ, ఇండోర్‌, రాజ్‌కోట్‌ వేదికలుగా ఈ వన్డే సిరీస్ జరుగనుంది. సెప్టెంబర్ 22-27 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ అయిపోగానే వరల్డ్ కప్ మొదలవుతుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రాక్టీస్ కు, జట్టు కూర్పుకు సమయం దొరుకుతుంది.


Tags:    

Similar News