రాజ‌కీయాల్లోకి షమీ ఎంట్రీ?..లోక్ సభ ఎన్నికల్లో పోటీ?

By :  Vinitha
Update: 2024-03-08 04:49 GMT

గతేడాది వన్డే వరల్డ్ కప్లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అదరగొట్టాడు. అయితే, ఇదే టోర్నీలో గాయ‌ప‌డిన ష‌మీ ఆ త‌ర్వాత చికిత్స తీసుకుని ప్రస్తుతం కుదురుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం షమీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బీజేపీ నేత‌లు ష‌మీతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ని, వాటికి అతను సానూకులంగానే స్పందించిన‌ట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగాల్‌లోని బ‌సిర్‌హ‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ష‌మీని బ‌రిలోకి దించేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే షమీ ఇంకా దానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక బెంగాల్ క్రికెట‌ర్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇదేమీ కొత్త‌కాదు. ష‌మీ కంటే ముందే ఇద్దరు టీమిండియా క్రికెటర్లు ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉన్నారు. మ‌నోజ్ తివారీ టీఎంసీ పార్టీ త‌ర‌పున గ‌త‌ ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌స్తుతం మంత్రి ఉన్నారు. అలాగే అశోక్ దిండా కూడా బీజేపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 

Tags:    

Similar News