`T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్- పాక్‌ మ్యాచ్ ఎప్పుడంటే..?

Byline :  Bharath
Update: 2024-01-05 06:40 GMT

ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక వరల్డ్ కప్ లో అంటే.. ఆ ఉత్సాహం, ఉత్కంఠ అభిమానుల్లో వేరే లెవెల్లో ఉంటుంది. ఇదివరకంటే.. ఇరు జట్ల మధ్య దైపాక్షిక సిరీస్ లు నిర్వహించేవారు. కొన్ని సెక్యూరిటీ కారణాలవల్ల వాటిని ఆపేశారు. అభిమానుల హైప్ ను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ కూడా 2013 నుంచి ఏ మెగా ఈవెంట్ జరిగినా.. అందులో ఇండియా- పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా చూస్తున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ లో కూడా ఇరు జట్లను ఒకే గ్రూప్ లో ఉంచింది ఐసీసీ. తాజాగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ను కూడా ఐసీసీ రివీల్ చేసింది.

వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024.. జూన్ 3 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ సిటీలో తలపడనున్నారు. 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇరు జట్ల మధ్య సమరం ఏ రేంజ్ లో జరిగిందో అందరికీ తెలిసిందే. మెల్బోర్న్ వేదికపై, 90000 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో.. విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.

ఈసారి 20 జట్లు పాల్గొంటుండగా.. జూన్ 12న అమెరికాతో, జూన్ 15న ఫ్లోరిడాతో భారత్ లీగ్ మ్యాచుల్లో తలపడనుంది. కాగా భారత్ గ్రూప్ మ్యాచులన్నీ అమెరికా వేదికపైనే జరగనున్నాయి. జూన్ 29 న బార్బడోస్ లో ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.




Tags:    

Similar News