అమెరికా అధ్యక్ష బరిలో మరో ప్రవాస భారతీయుడు

By :  Kiran
Update: 2023-07-30 02:27 GMT

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో మరో ప్రవాస భారతీయుడు నిలిచారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ హిర్ష్‌వర్దన్‌ సింగ్‌ గురువారం ప్రకటించారు. ఆ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు...నిక్కీ హేలీ(51), వివేక్‌ రామస్వామి(37) అమెరికా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. అయితే, ఈ ముగ్గురు కూడా రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతుండటం విశేషం. ఈ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రిపబ్లికన్లలో తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలో రిపబ్లికన్ల జాతీయ సదస్సు తేల్చనుంది.

హిర్ష్‌ వర్ధన్‌ 2020లో అమెరికా సెనేట్‌కు పోటీ చేసి ఓడిపోయారు.అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు జన్మించిన హిర్ష్‌ వర్ధన్‌ సింగ్‌.. 2009లో న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌ కంప్లీట్ చేశారు.

Tags:    

Similar News