గిద్దలూరులో హృదయాలను కదిలించే ఘటన ..

Update: 2023-05-31 12:34 GMT

ప్రకాశం జిల్లా గిద్దలూరులో హృదయాలను కదిలించే ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ తల్లి సంచిలో కట్టి వదిలివేసింది. ఒక్క క్షణం ఆలస్యమైతే పందులు కొరికేయవల్సిన ఆ శిశువును అధికారులు కాపాడారు.

కారణమేమిటో తెలియదు గానీ గిద్దలూరు ఎమ్మార్వో కార్యలయంలో ప్రాంగణంలో అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ తల్లి వదిలి వెళ్లిపోయింది. సంచిలో కట్టి అక్కడ పెట్టేసింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్న పందులు సంచిని లాక్కెళ్లేందుకు ప్రయత్నించాయి. ఈ సమయంలో చిన్నారి గుక్కపెట్టి ఏచ్చింది. ఆ ఏడుపు రెవెన్యూ అధికారుల చెవిన పడడంతో శిశువును కాపాడారు. అనంతరం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉంది. నవజాత శిశువును ఎవరు, ఎందుకు వదిలేశారు అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.      

Tags:    

Similar News