వంతెనపై వెళతున్న టాటా ఏస్ వాహనం అదుపులో తప్పి వాగులో పడిపోవడంతో నలుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డాడు. ఏపీలోని ఏలూరు జిల్లాలో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న వాహనం కుక్కనూరు మండలం వేలేరు బ్రిడ్జిపై అదుపు తప్పి వాగులో బోల్తాపడింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన బూర్గంపాడు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.