ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

Update: 2023-06-23 06:00 GMT

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత సంబంధిత స్కూల్స్ జాబితా కూడా ఉంటుంది. ఇక్కడి నుంచే మార్క్ లిస్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీలో టెన్ట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2వ నుంచి 10 వరకు జరిగాయి. పరీక్షల కోసం 2,12,221 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా.. 1.87 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. పరీక్షలు ముగిసిన 13 రోజుల్లోనే ఫలితాలను విడుదలయ్యాయి. ఇక ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూశారు. దీనిలో పాస్ అయితే పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఏపీ టెన్త్ రెగ్యులర్ ఫలితాలను మే నెలలో విడుదల చేయగా 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 75.38 శాతం మంది పాస్ అవ్వగా.. బాలురు 69.27 శాతం మంది పాస్ అయ్యారు.

Tags:    

Similar News