AP CM JAGAN: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

By :  Kiran
Update: 2023-10-29 16:35 GMT

విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు జరిగిన ప్రమాదం గురించి అధికారులను ఆయనకు వివరించారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

విజయనగరంలో సమీపంలోని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి వీలైనన్న అంబులెన్స్ లను ఘటనాస్థలానికి పంపాలని జగన్ అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు దగ్గరలోని హాస్పిటళ్లలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వైద్యారోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని అన్నారు.

Tags:    

Similar News