Vidadala Rajini : TDP గుండాలే దాడి చేశారు... మంత్రి విడుదల రజనీ

Byline :  Veerendra Prasad
Update: 2024-01-01 06:01 GMT

YSRCP పార్టీ ఆఫీసుపై దాడులను ఖండించారు ఏపీ మంత్రి విడదల రజనీ. ఇలాంటి చర్యలకు పాల్పడటంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ వేడులను సాధారణంగా జరుపుకోకుండా పథకం ప్రకారమే దాడి చేశారని అరోపించారు. డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తోందని వివరించారు మంత్రి రజినీ. ఈ రోడ్డుపై ఇలాంటి రాళ్లు ఎక్కడా లేవన్నారు. వీటిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి తాము కొత్తగా నిర్మించిన పార్టీ ఆఫీసుపై విసిరారన్నారు. కొత్త ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లేకపోతే పూర్తి స్థాయిలో అద్దాలు ధ్వంసం అయ్యేవని వివరించారు. చంద్రబాబుకు బీసీ సామాజిక వర్గం పట్ల ఎప్పుడూ చిత్తశుద్ది లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి రజనీ మీడియా మాట్లాడుతూ.. బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటాం. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతాం. చంద్రబాబు, నారా లోకేష్‌కు బీసీలపై కపట ప్రేమ. బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారు. బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసినప్పటికీ దాడి కొనసాగించారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ.. YCP కార్యాలయాన్ని ప్రారంభించు​కోవడాన్ని ఎల్లో బ్యాచ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు జయహో బీసీ అంటారు.. మరొకవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారు. గుంటూరులో ఆఫీసులపైన దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో రాత్రి ఘటనతోనే ప్రజలకు చెప్పారు. బీసీ మహిళ పోటీ చేయకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు.




Tags:    

Similar News