Chandra Babu Naidu : 151 మందిని మార్చినా వైసీపీ అధికారంలోకి రాదు - చంద్రబాబు

Byline :  Kiran
Update: 2023-12-15 13:00 GMT

వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ అన్ని సంప్రదాయాలు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా అని ప్రశ్నించారు. చెప్పింది ఒక్కటీ చేయని జగన్.. రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారని అన్నారు. 11 మంది ఇంఛార్జులను మార్చడంపై చంద్రబాబు సటైర్ వేశారు. జగన్ 151 మంది అభ్యర్థుల్ని మార్చినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎవరికీ ధైర్యంగా మాట్లాడే స్వేచ్ఛ లేదని, ఇదేం ప్రజాస్వామ్యమని చంద్రబాబు ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలను బలపరిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్న ఆయన.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో పోలవరం 72శాతం పూర్తైందని, ఒకవేళ తమ పార్టీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్లమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని స్పష్టం చేశారు.




Tags:    

Similar News