Chandrababu : సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఊరట.. ఆయన ఎక్కడైనా...

Update: 2023-11-28 10:37 GMT

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సుప్రీం కోర్టు ఊరట లభించింది. ఆయన తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చిని, సభలో, ఊరేగింపుల్లో యథావిధిగా పాల్గొనవచ్చని కోర్టు తెలిపింది. అయితే తదుపరి విచారణ వరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం గురించి బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకూడదని షరతు విధించింది. ఈ కేసులో హైకోర్టు బాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఏపీ సీఐడీ అధికారులు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. దీనిపై డిసెంబర్ 8వ తేదీ లోపు సమాధానం చెప్పాలని బాబును ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన హైకోర్టు ఆయన బహిరంగ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని షరతులు విధించింది. స్కిల్‌ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పే ఆధారాలను సీఐడీ అధికారులు తమకు అందించలేకపోయారని ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.


Tags:    

Similar News