చంద్రబాబు అరెస్ట్పై రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు

By :  Kiran
Update: 2023-09-29 12:01 GMT

టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అనే అనకొండ కోరల్లో చంద్రబాబు బలంగా ఇరుక్కున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా ఆయన అరెస్ట్ జరగదని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ జగన్ భుజం మీద నుంచి చంద్రబాబును గురి పెట్టిందని అన్నారు.ఏపీలో బీజేపీ బలపడాలనుకోవటమే వీటి వెనుక కారణమని రఘువీరా చెప్పారు.

టీడీపీ ఎన్ని నిరసనలు, ఉద్యమాలు చేసినా ప్రయోజనం శూన్యమని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని అక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. బీజేపీని బలోపేతం చేసేందుకే ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశారని రఘువీరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్రంలో బీజేపీ బలపడటానికేనని, భవిష్యత్తులో సీఎం జగన్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాక తప్పదని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News