40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క..పవన్ కళ్యాణ్

By :  Vinitha
Update: 2024-02-24 08:28 GMT

వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని తెలిపారు. జనసేనకి 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారని చెప్పారు. అయితే గత ఎన్నికల్లో 10 స్థానాలైన గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని తెలిపారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే కంటే..తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.

98 శాతం స్ట్రైక్‌ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేనాని అన్నారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో కొన్ని స్థానాలను త్యాగం చేసినట్లు పవన్ తెలిపారు. పొత్తులో భాగంగా త్యాగాలకు పాల్పడిన కార్యకర్తలకు టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చిన అవన్నీ దాటుకుని టీడీపీ- జనసేన గెలుపునకు కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ, జనసేననే అని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News