అందమును హత్య చేసెడి హంతకుండా... జగన్‌పై పవన్ ఫైర్

Update: 2023-07-24 12:38 GMT

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినే పవన్ కల్యాణ్ విమర్శలు ఆగడం లేదు. అవినీతి ప్రభుత్వం, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అంటూ దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా, చెట్లను కూడా వదిలిపెట్టడం లేదంటూ మండిపడ్డారు. జగన్ పర్యటన సందర్భంగా పచ్చని చెట్లు కొట్టెయ్యడంపై తీవ్రంగా స్పందించారు. ‘‘అందమును హత్య చేసెడి హంతకుండా...’’ అని ఓ ప్రముఖ కవి పద్యాన్ని ఉటంకిస్తూ దాడి చేశారు. జగన్ ఈ నెల 26న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో పర్యటంచనున్న సందర్భంగా హెలికాప్టర్ దిగేందుకు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్‌లోని కొబ్బరి చెట్లను నరికి హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. వీధిలోని చెట్ల కొమ్మలు కూడా నరికారు. వీటికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగన్ స్పించారు. వైకాపాలో పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయంటూ ఈ వీడియోలను ట్వీట్ చేశారు.

‘‘కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః.. జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు మీకు అర్థం కానప్పుడు, మొక్కలను చెట్లను గాయపరిస్తే ఎలా ఉంటుందో వీటిని చూస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి పట్టించుకోకపోయినా, చెట్లను నరకొద్దని ప్రధాన కార్యదర్శి అయినా అధికారులకు చెప్పాలి’’ అని ట్వీట్లు చేశారు. అంతేకాకుండా ప్రఖ్యాత కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ‘‘పుష్ప విలాపం’లోని పద్యాన్ని కూడా జతచేశారు.

పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన ఆ పద్యం ఇదీ...

ఓయీ మానవుడా.. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు

సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి..

అందమును హత్య చేసెడి హంతకుండా

మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ..

అని దూషించు పూలకన్నియల కోయలేక

వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని ..

నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..’’

Tags:    

Similar News