నన్ను చంపేందుకు కుట్ర.. కానీ అలా బతికాను : కేఏ పాల్

Byline :  Krishna
Update: 2024-01-05 10:57 GMT

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు తనకు ఫుడ్ పాయిజన్ ఇచ్చి చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు. డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని.. కానీ దేవుడి దయ వల్ల బతికి బయటపడినట్లు తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరిగిందని అన్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారి పేర్లను బయట పెట్టాలని అనుకోవడం లేదని.. దాని వల్ల మరొకరికి లబ్ది చేకూరుతుందని చెప్పారు.

అదేవిధంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పాల్ విమర్శలు గుప్పించారు. షర్మిల కాంగ్రెస్లో చేరడంతో వైఎస్సార్, రాజారెడ్డి ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు. వైఎస్సార్ బతికుంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని చెప్పారు. ఆస్తులు, పదవుల కోసమే షర్మిల తన పార్టీని సోనియా గాంధీకి అమ్మేశారని ఆరోపించారు. జగన్ ను తిట్టడం ఏపీని నాశనం చేయడమే ఆమె తన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని విమర్శించారు. 

Tags:    

Similar News