Kandula Durgesh : పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. నిడదవోలు నుంచి బరిలో కందుల

Byline :  Vamshi
Update: 2024-02-26 02:25 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్న కందుల దుర్గేశ్‌ను నిడదవోలు నుంచి పోటీ చేయించబోతున్నారు. నిదవోలు, రాజమహేంద్రవరం సమీపంలోనే ఉండటం జనసేనకు పట్టున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దుర్గేశ్‌కు పవన్ స్పష్టత ఇచ్చారు.రాజమహేంద్ర వరం గ్రామీణం నుంచి టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి బరిలోకి దిగుతున్నట్టు దుర్గేశ్‌కు చెప్పారు. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. మరోవైపు, రాజమహేంద్రవరం రూరల్ స్థానాన్ని జనసేన ఆశించడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఈ స్థానాన్ని ఒదులుకోబోమని కూడా పవన్ ఇటీవల స్పష్టం చేశారు.




 


అయితే, శనివారం టీడీపీ, జనసేనలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాత్రం ఈ స్థానం ప్రస్తావన లేకపోవడంతో ఉత్కంఠ మరింతగా పెరిగింది. పవన్ నిర్ణయంతో దీనికి తెరపడింది. పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైనా ఒత్తిళ్లు ఉంటాయి. దీని వల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నిడదవోలులో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని అన్నారు. వారు సహకరిస్తారని తనతో చెప్పారు’’ అని దుర్గేశ్ తెలిపారు. వైసీపీ నేతలకు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడే అర్హత లేదని దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఏ నాయకుణ్ణి ఎక్కడికి పంపిస్తున్నారో ముందు తెలుసుకోవాలని విమర్శలు చేశారు. జనసేన క్యాడర్ కొంత బాధతో ఉన్నమాట వాస్తవమేనని, వారందర్నీ సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామని తెలిపారు. పార్టీని వీడే ఆలోచన కానీ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే ఆలోచన కానీ లేదని దుర్గేశ్ స్పష్టం చేశారు.




Tags:    

Similar News