పిట్టదొరలా చంద్రబాబు కబుర్లు..కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

By :  Shabarish
Update: 2024-02-23 15:49 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాజీ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. కృ‌ష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలోని రాష్ట్రాల రాజధానులన్నీ కూడా వందల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అవే ఇప్పుడు మెగా సిటీలు అయ్యాయన్నారు. పొలాల్లో రాజధానిని ఎలా కడతామని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవాలకు దూరంగా రాజధాని గురించి మాట్లాడుతున్నారన్నారు.

ఏపీ రాజధాని రైతులు ఏం త్యాగం చేశారని కొడాలి నాని ప్రశ్నించారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటివి చూస్తే ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం ఎక్కడా చూడలేదన్నారు. 99 శాతంగా ప్రైవేటు ఆస్తులే ఉంటాయన్నారు. రాజధానిని నిర్మిస్తానని 33 వేల ఎకరాలను చంద్రబాబు తీసుకున్నారని, బాబు పిట్టలదొరలా కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను సీఎం జగన్ సృష్టించారన్నారు. రాజధానిని కడతానని గ్రాఫిక్స్‌తో చంద్రబాబు నాటకాలు ఆడారన్నారు. సీఎం జగన్ 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో డబ్బులు వేశారన్నారు. కోట్లాది మంది ప్రజలు ఏమైపోయినా చంద్రబాబు, పవన్, బీజేపీకి మాత్రమే పనిచేస్తారన్నారు. కానీ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి ఒక్క సీఎం జగనే అని అన్నారు. మే నెలలో మరోసారి సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి ఏ రాజకీయ నాయకుడికీ లేదన్నారు.


Tags:    

Similar News