సొంతగూటికి ఆర్కే.. జగన్ సమక్షంలో చేరిక..

Byline :  Krishna
Update: 2024-02-20 07:47 GMT

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి సొంతగూటికి చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇవాళ తన సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆర్కే సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళగిరి టికెట్ మరొకరికి ఇస్తారని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీని వీడారు. అటు జగన్ సైతం మంగళగిరి ఇంఛార్జ్గా గంజి చిరంజీవిని నియమించారు. అయితే క్షేత్రస్థాయిలో గంజికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో వైసీపీ అధిష్ఠానం పునరాలోచనలో పడింది. మళ్లీ ఆర్కేను చేర్చుకొని మంగళగిరి గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించాలని జగన్ భావించారు.రెండు రోజుల క్రితం ఆర్కేతో విజయసాయి రెడ్డి మంతనాలు జరపగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో ఇవాళ జగన్ తో సమావేశమై తిరిగి పార్టీలో చేరారు. మంగళగిరి గెలుపు బాధ్యతలను జగన్ ఆర్కేకు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేయనున్నారు. ఆయనకు ఈ సారి కూడా చెక్ పెట్టాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది.

Tags:    

Similar News