MLC Kavitha : ఏపీలో పర్యటించిన కవిత.. అదృష్టంగా భావిస్తున్నానంటూ..

By :  Krishna
Update: 2024-02-25 10:17 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీలో పర్యటించారు. గన్నవరంలోని ముంగండ గ్రామంలో ముత్యలమ్మ తల్లి ఆలయ పున:ప్రతిష్ఠాపనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 400 ఏళ్ల చరిత్ర గల అమ్మవారి పున:ప్రతిష్ఠాపనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు కవిత తెలిపారు. తల్లి కృపతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Tags:    

Similar News