వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు..

Update: 2023-06-10 11:51 GMT

మాజీ మంత్రి, వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గుండెపోటుకు గురయ్యారు. ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే పార్థసారథిని కుటుంబ సభ్యులు విజయవాడ అశోక్ నగర్ లోని టాప్ స్టార్ హాస్పిటల్‎కు తరలించారు. పార్థసారథిని పరీక్షించిన వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పార్థసారథి గుండెపోటుకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. 

Tags:    

Similar News