తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరం

Byline :  Kalyan
Update: 2023-10-29 05:56 GMT

టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. తనతో ములాఖత్ సందర్భంగా టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్కు చంద్రబాబు ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉంటున్నామో నేతలకు వివరించాలని కాసానికి చంద్రబాబు సూచించారు.

టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల బరిలో నిలవాలని భావించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. అయితే పార్టీ అధినేత పోటీకి నై అనడంపై కాసాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై ఇవాళ నారా లోకేశ్తో సమావేశమై కాసాని చర్చించనున్నారు.


Tags:    

Similar News