బాపట్ల జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2023-08-20 16:35 GMT

కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన విహారయాత్ర విషాదంగా మారింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. తల్లితో పాటు ఇద్దరు చిన్నారుల ఆచూకీ కనబడకుండా పోయింది. మరొక వ్యక్తి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఆదివారం నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం గ్రామానికి వెళ్తున్న పడవ నిజాంపట్నం వద్దకు రాగానే కెరటాల ఉద్ధృతికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News