YS Sunitha : వివేకా హత్య కేసు.. సునీత సంచలన వ్యాఖ్యలు

Byline :  Vamshi
Update: 2024-03-01 07:03 GMT

తెలుగు రాష్టాల్లోపెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికి తేలలేదు. ఈ నేపథ్యంలో వివేక కుమార్తె సునీతా రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మా తండ్రి హత్యకు గురై ఐదేళ్లు అవుతుంది.ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఐదేళ్లుగా కేసు ఎంక్వరీ కొనసాగుతుందని ఆమె అన్నారు. ఐదేళ్లుగా ఈ కేసులో సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదలు తెలిపారు. హత్యా రాజకీయాలు ఉండకూడదని సునీతా అన్నారు.మా అన్నా జగన్ పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అని ఆమె అన్నారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ న్యాయంగా విచారణ జరపాలని.. కానీ, ఆ పని చేయడం లేదని, వారిపై ఏ ఒత్తడి ఉందో తనకు తెలియదని చెప్పారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు. కర్నూలులో ఎంపీ అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లి, అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారులు వెనక్కి వచ్చారని.. ఎవరినైనా అరెస్ట్ చేయకుండా సీబీఐ వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ఆమె అన్నారు.

Tags:    

Similar News