‘బాబాయిని ఎవరు చంపారు ?’.. లోకేష్ పాదయాత్రలో పోస్టర్ల కలకలం

Update: 2023-06-01 14:18 GMT

నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో వివేకాని ఎవరు చంపారనే దానిపై వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. ప్రస్తుతం కడప జిల్లా ప్రొద్దుటూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో వందల మంది టీడీపీ కార్యకర్తలు ‘బాబాయిని ఎవరు చంపారు?’పోస్టర్లతో ర్యాలీ చేశారు. ఆ పోస్టర్‌పై వైఎస్ వివాకానందరెడ్డి ఫోటోతో పాటు, సీఎం జగన్, అవినాష్ రెడ్డి చిత్రాలను ప్రదర్శించారు. వీటిని పోలీసులు లాక్కోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసులకు, టీడీపీ నాయకుల మధ్య కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. నారా లోకేష్ సైతం పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పాదయాత్రకు వ్యతిరేకంగా టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అధికారులను ప్రశ్నించారు. అనంతరం వందల సంఖ్యలో ప్లకార్డులు పట్టుకొని కార్యకర్తలు పాదయాత్రలో ముందుకు సాగారు.

Tags:    

Similar News