TDP chief Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

Byline :  Veerendra Prasad
Update: 2024-02-11 11:48 GMT

పొత్తుల కోసం కాకుండా.. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వమని (ప్రధాని)కాళ్లు పట్టుకోమని టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. ఎన్టీఆర్ పై గౌరవం ఉంటే ప్రధాని దగ్గరకి వెళ్లి భారతరత్న ప్రకటించేలా చేయమని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని తన స్వార్ధానికి వెళ్లి పొత్తుల కోసం అందరి కాళ్లు పట్టుకుంటున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాకే పొత్తు పెట్టుకుంటామని తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు దగ్గర ఉన్న పార్టీ నకిలీ టీడీపీ అని, అసలైన పార్టీ ఎన్టీ రామారావు గారిదని అన్నారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. ఎన్టీఆర్‌ని చంపింది చంద్రబాబేనని, ఆ ద్రోహాన్ని భగవంతుడు కూడా క్షమించడని అన్నాడు. ఇక కేంద్రాన్ని కూడా విమర్శించిన ఎమ్మెల్యే.. ఎన్టీఆర్ ప్రజల మనిషి అని, పీవీ నర్సింహరావు కన్నా గొప్ప నాయకుడని, ఆయన కన్నా గొప్ప పనులు చేశాడని అన్నారు. గతంలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో చేసిన అనుభవంతో చెబుతున్నానని... మహనుబావుడైన ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వకుండా ఒక్క పీవీ నర్సింహారావుకి ఇచ్చి చేతులు దులుపేసుకుంటే న్యాయమా అని ప్రశ్నించారు. ఏం ద్రోహం చేశాడని భారతరత్న ఇవ్వకుండా పక్కన పెట్టారని ప్రశ్నించారు.

చంద్రబాబు ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా అది తమకే కలిసి వస్తుందని, ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి జగనే అని జోస్యం చెప్పారు. భార్యనే చూసుకోలేనోడని అసెంబ్లీ సాక్షిగా మోడీని తిట్టిన చంద్రబాబు, అమిత్ షా కారుపై రాళ్లు రువ్వించిన చంద్రబాబు.. ఇవన్నీ మర్చిపోయి పోత్తులకు సిద్ధం కావడం సిగ్గుచేటన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని తెలియజేశారు.



 


Tags:    

Similar News