YS Sharmila : చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల..

Byline :  Krishna
Update: 2024-01-13 06:17 GMT

వైఎస్ షర్మిల ప్రస్తుతం తన కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 17న తన కొడుకు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరగనుంది. ఈ నెల 18న వీరి ఎంగేజ్మెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో షర్మిల వెడ్డింగ్ కార్డుల పంపిణీలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి ఆమె వెళ్లారు. తన కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారని షర్మిల చెప్పారు. రాజకీయాల గురించి తమ మధ్య చర్చ జరగలేదని స్పష్టం చేశారు.




 


ఇక రాహుల్ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యమని.. అందుకోసమే తాను కూడా పనిచేస్తానని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టిన ఆమె.. ఎన్నికల తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే జగన్ను జైల్లో వేసిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేయడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.


Tags:    

Similar News