పవన్ కల్యాణ్ను కలిసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల

Byline :  Kiran
Update: 2024-01-17 14:19 GMT

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం పవన్ కు తన కొడుకు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని కోరారు.

షర్మిల ఇప్పటికే తన సోదరుడు, ఏపీ సీఎం జగన్తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కొడుకు పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరారు.

షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న ప్రియా అట్లూరితో జరగనుంది. జనవరి 18న నిశ్చితార్థం కార్యక్రమం నిర్వహించనున్నారు. రాజా రెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రియా అట్లూరితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వారిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. అమెరికాలో పుట్టి పెరిగిన ప్రియా అట్లూరికి అక్కడి పౌరసత్వం ఉంది. 

Tags:    

Similar News