పదిపాసయితే చాలు...ప్రభుత్వ ఉద్యోగం

Update: 2023-08-16 09:37 GMT

నిరుద్యోగులకు సూపర్ న్యూస్ చెప్పింది గవర్నమెంట్. పది పాయితే చాలు ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని చెప్పింది. వరుసగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీల గురించి ప్రకటనలు విడుదల చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పోస్ట్ శాఖలో ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ జారీ చేసింది.

తపాలాశాఖలో 30వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి పరీక్ష కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. గ్రామీణ డాక్ సేవకులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్స్ పోస్టులలో భర్తీలు ఉంటాయి. ఈ 23లోపు వీటికి అప్లై చేసుకోవాలి. indiapostgdsonline.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకున్ తర్వాత ఆగస్టు 24 నుంచి 26 వరకు ఎడిట్ చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నారు. అయితే కచ్చితంగా 10వ తరగతి మాత్రం పాసై ఉండాలి.

మొత్తం 30041 గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్స్ కోసం రిక్రూట్ మెంట్ జరుగుతోంది. 18 నుంచి 40 ఏళ్ళలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చును. 10వ తరగతిలో లెక్కలు, ఇంగ్లీషు సబ్జెక్టులు కచ్చితంగా చదివి ఉండాలి. స్థానికి భాషలో పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఫారమ్ నింపడానికి 100 రూ. ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది కూడా జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు మాత్రమే. వీటితో పాటూ అభ్యర్ధులకు కంప్యూటర్ ఆపరేషన్ మీద ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం కూడా తెలిసి ఉండాలి.

Tags:    

Similar News