మార్చి 1 నుంచి 10th పరీక్షలు.. విద్యాశాఖ షెడ్యూల్ విడుదల

Byline :  Bharath
Update: 2024-02-09 16:10 GMT

తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 1 నుంచి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అన్ని పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్న కారణంగా.. పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 4: 45 గంటల వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని జిల్లాల్లోని అన్ని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ.మార్చి 1 నుంచి 10th పరీక్షలు.. విద్యాశాఖ షెడ్యూల్ విడుదల

Tags:    

Similar News