తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు గడువు తేదీలను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు నవంబర్ 14 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రకటించింది. నవంబర్ 16 నుంచి 23 వరకు రూ.100 ఫైన్తో చెల్లించవచ్చని చెప్పింది. రూ.500 ఫైన్తో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4వరకు, రూ.1000 జరిమానాతో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫీజు కట్టవచ్చని చెప్పింది. రూ.2 వేల ఫైన్తో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఫస్టియర్ రెగ్యులర్ విద్యార్థుల ఫీజు రూ.510, ఒకేషనల్ స్టూడెంట్స్ కు రూ. 730, సెకండియర్ ఆర్ట్స్ స్టూడెంట్స్కు రూ. 510, సైన్స్, ఒకేషనల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు నిర్వహించే ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగించాలని ఇంటర్మిడియెట్ బోర్డు నిర్ణయించింది. ఫస్టియర్ విద్యార్థులు ఇకపై ఒక ఇంటర్నల్ పరీక్షను మాత్రమే రాయాల్సి ఉంటుందని చెప్పింది.