ఇద్దరి మహిళల ప్రాణాలు తీసిన 10వేల అప్పు

Update: 2023-06-19 02:49 GMT

అన్న 10 వేల అప్పుకు ఇద్దరు అక్కాచెల్లెల్ల బలయ్యారు. అన్న ప్రాణాలు కాపాడబోయి వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఢిల్లీలో జరిగింది. ఆర్కే పురం అంబేద్కర్‌ బస్తీకి చెందిన లలిత్‌ అనే వ్యక్తి గతంలో దేవ్ అనే వ్యక్తికి 10వేల అప్పు ఇచ్చాడు. తాను ఇచ్చిన అప్పు మొత్తం తిరిగి చెల్లించాల్సిందిగా ఆ వ్యక్తిని కోరాడు. ఈ క్రమంలో దేవ్.. మరికొందరితో కలిసి శనివారం లలిత్‌తో గొడవకు దిగారు.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవ్ మరో 20 మందితో కలిసి లలిత్‌ ఇంటిపై దాడికి దిగాడు. అతడి ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన లలిత్ సోదరీమణులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పింకీ, జ్యోతి అనే మహిళలు మరణించారు. ఓ బుల్లెట్ లలిత్కు కూడా తగలడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అరుణ్‌, మిషెల్‌, దేవ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీసీపీ మనోజ్‌ తెలిపారు.

ఈ ఘటన రాజకీయ దుమారానిక తెరదీసింది. ఢిల్లీలో ప్రజల భద్రతపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బాధిత మహిళల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఢిల్లీ వాసుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారు.. ఆ పనిని వదిలేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బిజీ ఉన్నారు. ఆప్ ప్రభుత్వం చేతిలో శాంతిభద్రతలు ఉండి ఉంటే.. ఢిల్లీ మరింత భద్రంగా ఉండేది’’ అని అన్నారు.

Tags:    

Similar News