ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి

By :  Kiran
Update: 2023-10-03 11:29 GMT

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఓ యువతి ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితుడు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.

నల్లపాడు శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఖమ్మంకు చెందిన రాధ అనే యువతిని ప్రేమించాడు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో యువకుడు ఆమెను దూరం పెట్టాడు. దీంతో రాధ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ క్రమంలోనే మంగళవారం గుంటూరుకు వచ్చిన రాధ, వెంకటేష్ తో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. అందుకు బాధితుడు నిరాకరించడంతో యాసిడ్ దాడి చేసింది.

యువతి యాసిడ్ పోయడంతో వెంకటేష్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితుణ్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి అక్కడే చికిత్స కొనసాగుతోంది. యాసిడ్ దాడికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News