IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

Byline :  Vijay Kumar
Update: 2024-01-28 14:19 GMT

ఏపీలో రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇటీవల మొత్తం 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిన జగన్ ప్రభుత్వం.. తాజాగా 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖ కమిషనర్ గా బాలాజీ రావ్, శ్రీకాకులం జిల్లా కలెక్టర్ గా మంజీర్ జిలానీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకట రమణారెడ్డి, తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్ గా కె.శ్రీనివాసులను ప్రభుత్వం బదిలీ చేసింది.

బదిలీ అయిన అధికారులు వీళ్లే..

..అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా కిషోర్

..విపత్తుల శాఖ డైరెక్టర్ గా కూర్మనాథ్

..శ్రీకాకులం మున్సిపల్ కమిషనర్ గా తమీమ్ అన్సారియా

..మన్యం జిల్లా జేసీగా అంబేద్కర్

..జీవీఎంసీ కమిషనర్ గా విశ్వనాథన్

..విశాఖ జేసీగా మయూర్ అశోక్

..ప్రకాశం జిల్లా జేసీగా గోపాలకృష్ణ

..కాకినాడ జిల్లా జేసీగా ప్రవీణ్ ఆదిత్య

..సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డైరెక్టర్ గా గోవిందరావు

..విజయనగరం జిల్లా జేసీగా కొల్లా బత్తుల కార్తీక్

..అల్లూరి జిల్లా జేసీగా భావన

..అర్బన్ ఇన్ ఫ్రా కార్పొరేషన్ ఎండీగా హరిత

..నెల్లూరు జేసీగా అదర్స్ రాజీంద్రన్

..తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గా అదితి సింగ్

..పోలవరం ప్రాజెక్టు అడ్మిన్ గా ఇలక్కియా

..పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెక్రటరీగా రేఖా రాణి

Tags:    

Similar News