ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన టీమిండియా క్రికెటర్లు

Update: 2024-02-02 15:45 GMT

విశాఖపట్నంలో క్రికెట్ సందడి నెలకొంది. వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో స్టేడియానికి వెళ్లేందుకు రెండు దేశాలకు చెందిన క్రికెటర్లు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. రెండు జట్లకు రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే హోటల్ నుంచి స్టేడియానికి రెండు దేశాల ఆటగాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ట్వీట్ చేశారు. బీసీసీఐకి, ఇంగ్లండ్ బోర్డుకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఎగబడ్డారు.


Tags:    

Similar News