ఎయిర్ ఇండియా సంస్థపై భారీ జరిమానా..ఈ రూల్స్ మీరినందుకే?

By :  Vinitha
Update: 2024-03-22 14:05 GMT

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూల్స్ ను మీరినందుకు గానూ ఎయిర్ ఇండియా సంస్థపై జరిమానా విధించింది. పైలెట్లకు రెస్ట్ ఇవ్వకుండా డ్యూటీలు వేస్తూ..ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, ఫెటీగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ రెగ్యులేషన్స్ అతిక్రమించినందుకు ఆ సంస్థకు రూ. 80 లక్షలు ఫైన్ విధించింది.

DGCA ఎయిర్ ఇండియా విమానంలో అడిట్ నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు 60 సంవత్సరాలకు మించి వయసున్న వారు ఉన్నారని తెలిసింది. అంతేగాక పైలెట్ల డ్యూటీ, ట్రిప్‌ల తర్వాత, ముందు రెస్ట్ ఇచ్చే విషయాల్లో రూల్స్ ఫాలో కాలేదని DGCA రూ.80 లక్షలు ఫైన్ వేసింది. సివిల్ ఏవియేషన్ భద్రత పెంచడానికి కఠిన చర్యలు తీసుకుంటామని DGCA తెలిపింది.

Tags:    

Similar News