కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం

Byline :  Vamshi
Update: 2024-03-30 11:36 GMT

మహిళలు కిచెన్‌కి పరిమితమవ్వాలన్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శివ శంకరప్ప వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మయిలు పోరాడగలరనే పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని నేను భారత్‌కు పతాకలు సాధించినప్పుడు కాంగ్రెస్ ఏం ఆలోచిందని ఆమె ప్రశ్నించింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా స్త్రీద్వేష వ్యక్తుల నుంచి అవమానం జరుగుతోంది. ఇది నిజంగా బాధకరం అని మండిపడ్డారు.

మహిళలు వంట గదికే పరిమితమవ్వాలట... కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చెబుతున్నారు... అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదని విమర్శించారు. కర్ణాటకలోని దావణగెరే లోక్ సభ బీజేపీ అభ్యర్థి గాయత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గాయత్రికి మాట్లాడటం సరిగా రాదని, కేవలం ఆమెకు కిచెన్‌లో వంట ఎలా చేయాలో మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News