ఆఫీస్లో ఉద్యోగి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాడని..బాస్ ఏం చేశాడో తెలుసా..?
నేటి ఉరుకులపరుగుల యాంత్రిక జీవితంలో ఉద్యోగులు అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంటి సమస్యలతో పాటు ఆఫీస్లోనూ అనేక రకాలుగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది బాస్ల వ్యవహారం ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటుంది. మరికొంత మంది బాస్ల విచిత్రమైన ప్రవర్తన
అప్పుడప్పుడు ఉద్యోగులకు తేరుకోలేని షాక్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో ఓ ఉద్యోగికి తన ఆఫీస్లో విచిత్రమైన సంఘటన ఎదురైంది. అందుకు సంబంధించిన వార్త తాజాగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆఫీసులో ఫోన్కు ఛార్జింగ్ పెట్టిన ఓ ఉద్యోగిని ఆ బాస్ అన్న మాటలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఆ బాస్ వ్యవహారం తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇలాంటి బాస్లు కూడా ఉంటారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బాస్ ఏమన్నాడంటే..
ఆఫీసులో తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని వివరిస్తూ ఓ ఉద్యోగి నెట్టింట్లో ఓ పోస్టు పెట్టాడు. రాత్రి ఫోన్కు ఛార్జింగ్ పెట్టడం మరిచిపోయిన ఆ వ్యక్తి ఆఫీస్కి రాగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఎంప్లాయి ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టడంపై ఫైర్ అయ్యాడు బాస్. ఏంటీ ఆఫీసులో కరెంట్ దొంగతనం చేస్తున్నావా అంటూ మండి పడ్డాడు. దీంతో ఒక్కసారిగా సదరు ఉద్యోగి షాక్ అయ్యాడు. బాస్ తీరుతో హర్ట్ అయ్యాడు. ఆయన మాటలకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాక తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్టుపై నెటిజన్లు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. అతడికి ఏమైనా మెంటలా..? గాలి పీల్చినా, నీరు తాగినా చోరీ చేసినట్లేనే అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.