Bumble Bee : కందిరీగల దాడి.. ఎయిర్ ఫోర్స్ అధికారి మృతి!

Byline :  saichand
Update: 2024-01-10 12:03 GMT

కందిరీగలు దాడి కారణంగా ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి చెందిన ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంద. చండీగఢ్‌లోని ఎయిర్‌ఫోర్స్‌లో మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎయిర్ ఫోర్స్‌ అధికారి రంజిత్ కుమార్.. రెండు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామైన ద్రోన్‌పూర్ వచ్చారు. మనవడితో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన కందిరీగల గుంపు వారిపై దాడి చేసింది. ఈ క్రమంలో మనవడిని అక్కడి నుండి తప్పించినప్పటికీ ఆయన మాత్రం తప్పించుకోలేపోయాడు. కందిరీగల గుంపు రంజిత్‌పై దాడి చేసి ముఖం, చేతులు, పాదాల మీద తీవ్రంగా కుట్టాయి. దీంతో శరీరమంతా దద్దులు వచ్చాయి. ఈ క్రమంలో స్పృహ తప్పి పడిపోయిన రంజిత్ కుమార్‌ను కుటుంబ సభ్యులు ఆప్సత్రికి తరలించారు. కానీ అప్పటికే అలస్యం కావడంతో రంజిత్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎస్‌కేఎంసీహెచ్‌ ఓపీ ఇన్‌చార్జి ఆదిత్యకుమార్‌ మీడియాకు వివరించారు. ఇక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌కెఎంసిహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామ ప్రజల భయోంధళనకు గురవుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు.

Tags:    

Similar News