Rajasingh : త్వరలోనే బీజేపీ ప్రభుత్వం వస్తుంది.. ఎమ్మెల్యే రాజాసింగ్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-06 08:14 GMT

తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెల్చుకుందని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. అంబేడ్కర్‌ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అప్పులు తీర్చే క్రమంలో చతికిలపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని, ఏడాది లోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.




Tags:    

Similar News