ISKCON: ఇస్కాన్పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

By :  Kiran
Update: 2023-09-27 06:46 GMT

"ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ కృష్ణా కాన్సియ‌స్‌నెస్‌"..(ISKCON) ఇస్కాన్ పై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. (Bjp Mp Menaka Gandhi) ఇస్కాన్ సభ్యులో దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోశాలల నిర్వాహణ పేరుతో వారు ఆవుల్ని కసాయివాళ్లకు అమ్ముకుంటున్నారని మేనకా గాంధీ ఆరోపించారు. బీజేపీ ఎంపీ ఆరోప‌ణ‌ల్ని ఇస్కాన్ ఖండించింది. అవన్నీ నిరాధార‌మైన‌వ‌ని చెప్పింది.

"ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందుత‌ున్న ఇస్కాన్, త‌మ గోశాలల్లో ఉన్న ఆవుల్ని అమ్ముకుంటున్న‌ట్లు మేన‌కా గాంధీ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైర‌ల్ గా మారింది." అందులో ఆమె ఇటీవలే ఏపీలోని అనంత‌పురంలో ఉన్న గోశాల‌ను సంద‌ర్శించిన‌ట్లు చెప్పారు. అక్క‌డ వట్టిపోయిన ఆవు ఒక్క‌టి కూడా కనిపించలేదని, దూడ‌లు కూడా లేవ‌ని అన్నారు. గోశాలలో కనీసం ఒక్క ఆవు కూడా లేదంటే అక్కడి గోవుల్ని అమ్ముకుంటున్నట్లే కదా అని మేనకా గాంధీ ఆరోపించారు. ఆవుల్ని అమ్ముకుంటున్న ఇస్కాన్ .. రోడ్డు మీద మాత్రం హ‌రే రామ హ‌రే కృష్ణ అని భజన చేస్తోందని అన్నారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నామని చెప్పుకునే ఇస్కాన్ సభ్యులు అమ్మినంత‌గా మ‌రెవ‌రూ ఆవుల్ని క‌సాయి వాళ్లకు అమ్మ‌ర‌ని ఆమె మండిపడ్డారు.

మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్‌ తీవ్రంగా ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్‌ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని చెప్పింది. ఈ మేరకు ఇస్కాన్‌ ప్రతినిధి యుధిష్టిర్‌ గోవిందా దాస్‌ ట్విట్టర్లో ఓ పోస్ట్‌ చేశారు. భారత్ లోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తాము గోవుల్ని సంరక్షిస్తున్నట్లు అందులో రాశారు. గోవుల‌కు జీవితాల‌ను ప్ర‌సాదిస్తున్నామ‌ని, వాటిని క‌సాయిల‌కు అమ్మ‌డం లేద‌ని ఇస్కాన్ స్పష్టం చేసింది.

Tags:    

Similar News