Ayodhya Ram Temple Inauguration: అయోధ్య రాయిలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్

By :  Bharath
Update: 2024-01-10 11:41 GMT

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శోభ దగ్గర పడుతున్న కొద్దీ.. భక్తుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖులందరూ.. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానాలందాయి. ఈ లిస్ట్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌధరిలకు కూడా ఆహ్వానం అందింది. కాగా తాజాగా ఈ వేడుకకు హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెందిన పొలిటికల్ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.




Tags:    

Similar News