స్టేజ్‌పై కచేరి.. రూ.లక్షలు వెదజల్లారు..

Byline :  Veerendra Prasad
Update: 2023-09-16 05:43 GMT

గుజరాత్‌కు చెందిన ఫోక్ సింగర్ ఊర్వశీ రదాదియాపై డబ్బుల వర్షం కురిసింది. ఆమె పాటకు మెచ్చిన అభిమానులు.. స్టేజీ మీద ఆమె పాడుతున్నంతసేపు అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. బకెట్లతో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించారు. దీంతో ఆ వేదిక మొత్తం నోట్లతో నిండిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అభిమానాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన రూ.లక్షలను గోశాల నిర్మాణం కోసం ఉపయోగించనున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు.

గతంలో కూడా ఊర్వశీకి ఇలాంటి అరుదైన అనుభవమే ఎదురైంది. అహ్మదాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన ఊర్వశీ.. ఆ కార్యక్రమంలో వేదికపై కూర్చొని ఆమె హార్మోనియా వాయిస్తూ పాటలు పాడారు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా ఊగిపోయారు. నోట్ల కట్టలను తీసి ఆమెపై చల్లారు. మరికొందరైతే బకెట్ల నిండా డబ్బును నింపి.. ఆమెపై గుమ్మరించారు. ఆ సమయంలో డబ్బంతా ఆమె మీద పడడంతో అదంతా పక్కకు తీసి ప్రదర్శన చేపట్టారు. ఈ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఆమె అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.




Tags:    

Similar News