కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం...తృటిలో తప్పించుకున్న విద్యార్థులు

Update: 2023-06-15 10:01 GMT

ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. కొంతమంది విద్యార్థులు కిటికీల ద్వారా బయట పడ్డారు. ప్రమాదకర స్థితిలో మూడో ఫ్లోర్ నుంచి వైర్ల సాయంతో కిందకు దిగారు. ఈ సమయంలో పలువురు విద్యార్థులు అదుపుతప్పి కిందకు పడినట్లు వైరల్ అయిన వీడియో‌లో కనిపిస్తోంది.

11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చి.. విద్యార్థులను కాపాడారు.ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గాయపడగా..మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. ముఖర్జీ నగర్‌ ప్రాంతంలోని ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags:    

Similar News