తండ్రీ కూతుళ్లని తెలివిగా పట్టించిన డిప్యూటీ సీఎం భార్య

Update: 2023-06-07 03:30 GMT

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృతా ఫడణవీస్‌‎ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో 56 ఏళ్ల బుకీ అనిల్ జైసింఘాని అతని 24 ఏళ్ల కూతురు అనిక్ష జైసింఘనిపై కోర్టులో ఛార్జ్‎షీట్ దాఖలు అయ్యింది. నిందితులు ఇద్దరినీ అమృత ఫడణవీస్‌‎ సాయంతోనే అరెస్టు చేసినట్లు మలబాల్ హిల్ పోలీసులు ఛార్జ్‎షీట్‎లో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న అనిల్‎పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నో కేసుల్లో అనిల్ నిందితుడుగా ఉన్నాడు. గత 8 ఏళ్లుగా అతడిని పట్టుకునేందకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసుల కన్నుగప్పి అనిల్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అనిల్‎ను పట్టుకునేందుకు అమృతా ఫడణవీస్‌ సహాయం తీసుకుని ఓ సీక్రెట్ ప్లాన్ చేశారు. అతనితో ఫోన్‎లో టచ్‎లోకి వెళ్లాలని పోలీసులు ఆమెకు తెలిపారు.



పోలీసుల సూచనల మేరకు అమృతా ఫడణవీస్‌ ఈ సీక్రెట్ ఆపరేషన్‎లో భాగమయ్యాడు. వారు చెప్పినట్లే అనిల్‎తో ఫోన్‎లో చాట్ చేశారు. మీ కేసుల గురించి నేను దేవేంద్ర ఫడణవీస్‌‎తో మాట్లాడతానని అతడికి అమృత ఓ మెసేజ్ పంపించింది. వెంటనే అనిల్ ఆమె ఫోన్‎కు కొన్ని ఆడియో మెసేజ్‎లను , డాక్యుమెంట్లను పంపించాడు. అలర్ట్ అయిన పోలీసులు నిందితుడి లొకేషన్‎ను ట్రేస్ చేశారు. అతడిని పట్టుకున్నారు. మార్చి 16న అనిక్షను, 19న అనిల్ జైసింఘానీని అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News