కౌంటింగ్ తేదీ మార్పు.. 4న ఎన్నికల ఫలితాలు

By :  Krishna
Update: 2023-12-01 16:18 GMT

మిజోరం ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మిజోరం ఎన్నికల కౌంటింగ్‌ తేదీని మార్చింది. ఈ నెల 4న మిజోరాం ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3న మిజోరం కౌంటింగ్ ఉండగా.. వివిధ వర్గాల అభ్యర్థనలతో కౌంటింగ్ డేట్ ఛేంజ్ అయ్యింది. డిసెంబర్ 3 ఆదివారం మిజోరం ప్రజలకు ప్రత్యేక రోజు కావడంతో కౌంటింగ్ డేట్ మార్పు చేయాలని పలు వర్గాలు ఈసీని కోరాయి. దీంతో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఫలితాలు ఈ నెల 3న విడుదల కానుండగా.. మిజోరం ఫలితాలు మాత్రం 4న రానున్నాయి.


Tags:    

Similar News