గుడ్‌న్యూస్..ఉద్యోగులకు డీఏ పెంచిన కేంద్రం!

Byline :  Shabarish
Update: 2024-03-07 15:11 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. డియర్‌నెస్ అలవెన్స్‌ను 46 శాతం నుంచి 50 శాతానికి మోడీ ప్రభుత్వం పెంచింది. ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరువు భత్యాన్ని పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే డీఏను కూడా జనవరి 1వ తేది నుంచి జూన్ 30వ తేది వరకూ పెంచుతున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ తీపికబురును అందించింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News